- Advertisement -
మన తెలంగాణ/మోత్కూరు: విద్యార్దులు పాఠశాల స్థాయిలోనే ఉన్నత లక్షాలను ఏర్పరుచుకొని లక్ష సాధనకు కృషి చేయాలని చౌటుప్పల్ ఏసిపి మధుసూధన్రెడ్డి అన్నారు. సోమవారం చౌటుప్పల్లో బడుగు రామస్వామి కమలమ్మ, పాలకూర్ల శివయ్యగౌడ్ ఫౌండేషన్ లు సంయుక్తంగా జ్ఞాన దీప్తి పురస్కారాల ప్రధానోత్సవ కార్యక్రమానికి ఏసిపి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. నిర్వహించారు. ఈసంధర్భంగా పదవ తరగతి ఫలితాల్లో ఉత్తమ మార్కులు సాధించిన మోత్కూరు ఉన్నత పాఠశాల విద్యార్దులు దేవినేని అర్చన, కాటం శివవాని, ఎడ్ల అక్షయ శ్రీ లను శాలువాలు, మొమోంటోలతో సత్కరించారు. నిర్వాహకులు బడుగు శ్రీ రాములు మాట్లాడుతూ పేదరికం చదువుకు అడ్డుకారాదని ప్రతిభ గల విద్యార్ధులను ఆదుకొనేందుకు ఎప్పుడూ ముందుంటామని అన్నారు. ఈకార్యక్రమంలో పాలకూర్ల మురళి, ఉపాద్యాయులు, విద్యార్ధులు , తల్లిదండ్రులు పాల్గొన్నారు.
- Advertisement -