హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల (Shekar Kammula) ఇండస్ట్రీలోకి వచ్చిన ఇటీవలే 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) సమక్షంలో ఈ వేడుకలు జరిగాయి. తన అభిమాన నటుడి సమక్షంలో ఈ వేడుకలు జరగడంతో శేఖర్ కమ్ముల ఎంతో సంతోషించారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి శేఖర్ కమ్ములపై సోషల్మీడియా వేదికగా ప్రశంసల వర్షం కురిపించారు.
శేఖర్ కమ్ములతో(Shekar Kammula) దిగిన ఫోటోలను పోస్ట్ చేసిన చిరు(Chiranjeevi).. ‘‘మై డియర్ శేఖర్, మీలాంటి ఒక అభిమాని వుండటం నాకూ అంతే ఆనందకరం. మీ ప్రస్థానానికి స్ఫూర్తి నిచ్చానని తెలిసి మరింత సంతోషించాను. మీ 25 సంవత్సరాల జర్నీలో ఆ విధంగా నేనూ ఒక భాగమైనందుకు గర్వంగా వుంది. సున్నితమైన వినోదంతో పాటు, ఒక సోషల్ కామెంట్ని జత చేసి ఆలోచనాత్మకంగా తీసే మీ సినిమాలంటే నాకు ఎంతో ఇష్టం. ఫిలిం మేకింగ్లో మీకంటూ ఒక ప్రత్యేక శైలిని క్రియేట్ చేసుకున్న మీరు ఇలాగే మరో 25 ఏళ్ళు మరెన్నో జనరంజకమైన సినిమాలు ‘రాస్తూ’, తీస్తూ, మరెన్నో ఉన్నత శిఖరాల్ని అధిరోహించాలని ఆకాంక్షిస్తూ, ఆశీర్వదిస్తున్నాను’’ అని రాసుకొచ్చారు.
ఇక సినిమాల విషయానికొస్తే.. చిరంజీవి ప్రస్తుతం ‘విశ్వంభర’ అనే సినిమా చేస్తుండగా.. శేఖర్ కమ్ముల నాగార్జున, ధనుష్ల కాంబినేషన్లో ‘కుబేరా’ అనే సినిమా చేస్తున్నారు.