Wednesday, September 3, 2025

భూపాలపల్లిలో ప్రియుడితో కలిసి కూతురిని చంపి… క్షుద్రపూజలు చేసినట్టు నమ్మించింది

- Advertisement -
భూపాలపల్లి: ప్రియుడి మోజులో పడి భర్త, కూతురిని కసాయి తల్లి హత్య చేసింది ఈ సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలో జరిగింది.  అడవిలో కూతురు మృతదేహం పడేసి చుట్టూ క్షుద్రపూజలు చేసినట్లు నమ్మించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…  వడితల గ్రామంలో కవిత అనే మహిళ తన భర్త, కూతురు వర్షిణితో కలిసి ఉంటుంది. భర్త పక్షవాతంతో బాధపడుతుండగా అదే గ్రామానికి చెందిన ఓ యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ వివాహేతర సంబంధం గురించి తెలుస్తుందని భర్తను జూన్ 25న చంపి వ్యాధితో చనిపోయాడని నమ్మించి అంత్యక్రియలు చేసింది.
వివాహేతర సంబంధం విషయం కూతురికి కూడా ఎలాగైనా తెలుస్తుందని ప్రియుడితో కలిసి వర్షిణి(22)ని కసాయి తల్లి కూడా కడతేర్చింది. కూతురు మృతదేహాన్ని భూపాలపల్లి – కాటారం జాతీయ రహదారకి పక్కన అడవిలో పడేసింది. అనంతరం మృతదేహం చుట్టూ నిమ్మకాయలు, పసుపు, కుంకుమ చల్లి ఆధార్ కార్డు పెట్టి నరబలిలా నమ్మించింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు మృతదేహం వద్దకు చేరుకొని కవితను అదుపులోకి తీసుకొని తనదైన శైలిలో ప్రశ్నించడంతో నిజాలు ఒప్పకుంది. 2 నెలల క్రితం ప్రియుడితో కలిసి భర్తను, ఇప్పుడు కూతురిని హత్య చేసినట్లు ఒప్పుకుంది. మరో హత్య కోసం కూడా ప్లాన్ చేసినట్టు సమాచారం. దీంతో ప్రియుడు, కవితను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. 
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News