లండన్: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2023-25లో దక్షిణాఫ్రికా ఛాంపియన్గా నిలిచింది. ఫైనల్లో డిపెండింగ్ ఛాంపియన్ను చిత్తుచేసి టైటిల్ను కైవసం చేసుకుంది. అయితే మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడిన సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవూమా సంచలన వ్యాఖ్య చేసారు. మేము బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఆసీస్ ఆటగాళ్లు ‘చోక్’ అనేపదాన్ని పదేపదే ఉపయోగిస్తూ స్లెడ్జింగ్ చేశారని పేర్కొన్నారు. ఆఖరిరోజు విజయం వైపుగా పయనిస్తున్న దక్షిణాఫ్రికా జట్టును అసహజంగా ఆటపై ఏకగ్రతను దెబ్బతీసేలా ఆసీస్ ఆటగాళ్లు అలా ప్రవర్తించారని బవూమా వెల్లడించారు.
కానీ, ఇప్పుడు ఈ విజయంతో ఆసీస్కు తగిన సమాధానం చెప్పామని బవూమా పేర్కొన్నాడు. అలాగే స్పిన్నర్ కేశవ్ మహారాజ్.. దక్షిణాఫ్రికా జట్టును (South African team) అనేక ఏళ్లుగా వెంటాడుతున్న ‘చోకర్స్’ అనే ట్యాగ్కు ఇది ముగింపు. ఇంకా ఆ పదం వినకపోవడం చాలా గొప్ప విషయం. ఇది జట్టుకి ఎంతో పెద్ద విజయం. గతంలో అడిగిన అన్ని ప్రశ్నలకు ఈ మ్యాచ్ సమాధానం ఇచ్చిందని’ తెలిపారు. కాగా, సౌతాఫ్రికా ఛాంపియన్స్గా అవతరించి, 18 ఏళ్ల నిరీక్షణకు తెరదించడంతో ఆ దేశంలో సంబురాలు అంబరాన్ని అంటాయి. భారీ ఎత్తున వేడుకలు చేసుకుంటున్నారు సఫారీలు.