Sunday, June 8, 2025

ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ మృతి పట్ల సిఎం రేవంత్‌ సంతాపం

- Advertisement -
- Advertisement -

జూబ్లీహిల్స్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ మృతిపట్ల ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాగంటి మృతికి సంతాపం తెలిపారు. గోపీనాథ్‌ కుటుంబ సభ్యులకు రేవంత్ రెడ్డి సానుభూతి తెలిపారు. ఈరోెజు తెల్లవారుజామున ఏఐజి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గోపీనాథ్ మరణించారు. దీంతో ఆయన మృతిపై బిఆర్ఎస్ నేతలు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు.ఆస్పత్రి నుంచి మాదాపూర్ లోని ఇంటికి మాగంటి గోపీనాథ్‌ భౌతికకాయాన్ని తరలించారు. ఇప్పటికే హరీశ్ రావు, కెటిఆర్ లు మాగంటి ఇంటికి చేరుకున్నారు. అభిమానులు, కార్యకర్తలు భారీగా మాగంటి నివాసానికి చేరుకుంటున్నారు. మాజీ సిఎం, బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ కూడా మరికాసేట్లో ఎర్రవల్లి ఫామ్ హౌజ్ నుంచి హైదరాబాద్ బయల్దేరనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News