Wednesday, June 4, 2025

గన్‌పార్కు వద్ద అమరవీరులకు సిఎం రేవంత్‌ నివాళులు

- Advertisement -
- Advertisement -

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అమరవీరులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. కొద్దిసేపటిక్రితమే గన్ పార్క్ కు చేరుకున్న సిఎం.. అక్కడ పుష్పగుచ్ఛం ఉంచి అమరవీరులకు నివాళులర్పించారు. సిఎం రేవంత్ తోపాటు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నగర మేయర్ గద్వాల విజయలక్ష్మీ తదితరులు గన్ పార్క్ వద్ద నివాళులర్పించారు. అనంతరం అక్కడి నుంచి సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ కు బయల్దేరారు. పరేడ్ గ్రౌండ్స్‌లో జాతీయ జెండా ఎగురవేయనున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సిఎం రేవంత్‌రెడ్డి రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ సందర్భంగా ఉత్తమ సేవలు అందించిన పోలీసు అధికారులకు మెడల్స్ అందజేయనున్నారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా జపాన్ ప్రతినిధి హాజరుకానున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News