Thursday, May 29, 2025

వర్షాకాలం.. అప్రమత్తం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా ఎలాంటి నష్టం వాటిల్లకుండా అప్రమత్తంగా ఉండాలని సిఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించా రు. భారీ వర్షాలు పడుతాయని వాతావర ణ శాఖ ఇచ్చిన సూచనలకు అనుగుణంగా తగిన ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సిఎం రేవంత్ సూచించారు. హైదరాబాద్ పరిధిలో అన్ని విభాగాల అధికారులు అం దుబాటులో ఉండాలని, జీహెచ్‌ఎంసీ, పో లీస్, హైడ్రా, ట్రాఫిక్, విద్యుత్ విభాగాలు సమన్వయంతో పని చేయాలని ఆయన ఆదేశించారు. రోడ్లపై నీరు నిల్వ లేకుండా చూడాలని, ట్రాఫిక్ ఇబ్బంది, విద్యుత్ సమస్యలు లేకుండా చూడాలని సిఎం ఆదేశించారు. లోతట్టు ప్రాంతాలు జలమయం కాకుండా, ప్రజలు ఇబ్బంది పడకుండా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని సిఎం పేర్కొన్నారు. వర్షాలు కురుస్తున్న ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు. గ్రేటర్ సిటీతో పాటు అన్ని జిల్లాల్లో ఎప్పటికప్పుడు వర్షాల పరిస్థితిని సమీక్షించాలని సిఎస్ ను ముఖ్యమంత్రి ఆదేశించారు.

సీజనల్ వ్యాధులు, జ్వరాలు రాకుండా చర్యలు చేపట్టాలి
ముందుగా వచ్చిన వర్షాల కారణంగా సీజనల్ వ్యాధులు, జ్వరాలు వచ్చే ప్రమాదముంటుందని ముఖ్యమంత్రి వైద్య ఆరోగ్య శాఖను సిఎం రేవంత్ అప్రమత్తం చేశారు. ప్రధానంగా ఏజెన్సీ ఏరియాలు, అటవీ ప్రాంతాలున్న జిల్లాల కలెక్టర్లు ప్రజారోగ్యంపై దృష్టి సారించాలని సిఎం ఆదేశించారు. పొరుగు రాష్ట్రాల్లో కొవిడ్ కేసులు కూడా నమోదవుతున్నాయని, అన్ని జిల్లాల్లోనూ సీజన్‌కు అనుగుణంగా తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సిఎం ఆదేశించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News