మన తెలంగాణ / హైదరాబాద్ : జిల్లా ఇ న్ఛార్జ్లుగా ఉన్న పలువురు మంత్రులను మారుస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. మహబూబ్నగర్ జిల్లాకు దా మోదర్ రాజనరసింహ, రంగారెడ్డి జిల్లాకు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, వరంగల్ జిల్లాకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, హైదరాబాద్కు పొన్నం ప్రభాకర్, నిజామాబాద్కు ధనసరి అనసూయ సీతక్క, కరీంనగర్కు తుమ్మల నాగేశ్వరరావు, ఆదిలాబాద్ జిల్లాకు జూ పల్లి కృష్ణారావును నియమించారు.
అలాగే నూతనంగా మంత్రివర్గంలో స్థానం పొం దిన వివేక్ వెంకటస్వామిని మెదక్, అడ్లూ రి లక్ష్మణ్ కుమార్ని నల్గొండ, వాకిటి శ్రీహరిలను ఖమ్మం జిల్లాకు ఇన్ఛార్జ్ మం త్రులుగా నియమించారు. కాగా డిప్యూటీ సీఎం, విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమా ర్క, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిలకు ఏ జిల్లాలను అప్పగించలేదు.