Saturday, June 14, 2025

ఓటుకు నోటు కేసులో సిఎం రేవంత్ రెడ్డికి మినహాయింపు

- Advertisement -
- Advertisement -

రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసు పై శుక్రవారం నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో తనకు మినహాయింపు ఇవ్వాలని సిఎం రేవంత్ రెడ్డి చేసిన అభ్యర్థనను కోర్టు పరిగణలోకి తీసుకుంది. ఈ కేసులో సిఎం రేవంత్ రెడ్డితో పాటు సెబాస్టియన్, ఉదయ్‌సింహా, వేం కృష్ణకీర్తన్‌ల హాజరుకు కోర్టు మినహాయింపు ఇచ్చింది. కాగా ఇదే కేసులో మత్తయ్య, సండ్ర వెంకట వీరయ్య శుక్రవారం హజరుకాగా తదుపరి విచారణను వచ్చే నెల జూలై 25వ తేదీకి వాయిదా వేసింది.

మరో కేసులో క్వాష్ పిటిషన్ విచారణ వాయిదా
శేరిలింగంపల్లి నియోజకవర్గం గోపన్‌పల్లిలో భూ వివాదానికి సంబంధించిన వ్యవహారంలో సిఎం రేవంత్ రెడ్డి హైకోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై విచారణను ధర్మాసనం శుక్రవారం వాయిదా వేసింది. దీనిని నెల 26వ తేదీకి వాయిదా వేసినట్లు కోర్టు పేర్కొంది. గోపన్ పల్లి సర్వే నెం.127కు సంబంధించిన భూముల వ్యవహారంలో గత బిఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో 2016 లో రేవంత్ రెడ్డిపై గచ్చిబౌలి పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు అయింది. ఈ కేసు కొట్టివేయాలని ఆయన హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు.
౦౦౦

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News