- Advertisement -
గుజరాత్లోని అహ్మదాబాద్లో జరిగిన ఘోర విమాన ప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన ఓ పోస్టు పెట్టారు. ఈ ఘటన కలిచి వేసిందని ఆయన పేర్కొన్నారు. ప్రమాద సమయంలో విమానంలో 200 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారని వారంతా ప్రాణాలతో సురక్షితంగా తిరిగి రావాలని ప్రార్థనలు చేయాలని ఆయన కోరారు. బాధితులను, వారి కుటుంబాలను ఆదు కోవడానికి కేంద్ర ప్రభుత్వం త్వరితగతిన సమర్థవంతంగా సహాయక చర్యలు చేపట్టాలని రేవంత్ రెడ్డి కోరారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు సిఎం రేవంత్రెడ్డి సంతాపం తెలియచేశారు.
- Advertisement -