సిఎం రేవంత్ రెడ్డికి హైకోర్టులో భారీ ఊరట లభించింది. నాలుగేళ్ల క్రితం నమోదైన ఒక కేసులో వ్యక్తిగతంగా కోర్టుకు హాజరుకావాల్సిన అవసరం లేదని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ మేరకు ఆయనకు మినహాయింపు ఇస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసి ంది. వివరాల్లోకి వెళితే, 2021లో ఎఐసిసి ఇచ్చిన పిలుపు మేరకు అప్పటి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు రాజ్భవన్ ముట్టడి కార్యక్రమం చేపట్టాయి. ఈ ఘటనపై సైఫాబాద్ పోలీసులు రేవంత్ రెడ్డితో పాటు పలువురిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి ఈ కేసు నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టులో విచారణ దశలో ఉంది. ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి, తనపై నమో దైన ఈ కేసును పూర్తిగా కొట్టివేయాలని కోరుతూ ఇటీవల హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయ స్థానం, కింది కోర్టులో విచారణకు వ్యక్తిగతంగా హాజరు కావడం నుంచి ఆయనకు మినహాయింపు ఇచ్చింది. ఈ వ్యవహారంపై కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ నాగేశ్వరరావును హైకోర్టు ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను అక్టోబర్ 7వ తేదీకి వాయిదా వేసింది.
రేవంత్ రెడ్డికి హైకోర్టులో ఊరట
- Advertisement -
- Advertisement -
- Advertisement -