Tuesday, June 3, 2025

రాష్ట్ర ప్రజలకు సిఎం రేవంత్ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు

- Advertisement -
- Advertisement -

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా సోమవారం రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. “అమరుల ఆశయాలకు… ప్రజల ఆకాంక్షలకు…పేదల సంక్షేమానికి… రైతుల సాగు స్వప్నాలకు… ఆడబిడ్డల ఆర్థిక స్వావలంబనకు… యువత బంగారు భవితకు… తెలంగాణ రైజింగ్ విజన్ కు… ఈ శుభదినోత్సవాన… పునరంకితమవుదాం. రాష్ట్ర ప్రజలకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు” అని సిఎం పేర్కొన్నారు. మరికాసేపట్లో గన్‌పార్క్ వద్ద అమరవీరుల స్థూపానికి సిఎం రేవంత్ నివాళులర్పించనున్నారు. ఆ తర్వాత సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జాతీయ జెండా ఎగురవేయనున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సిఎం రేవంత్‌రెడ్డి రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News