మన తెలంగాణ/హైదరాబాద్: కొత్తగా అభివృద్ధి చేస్తున్న గ్రీన్ఫీల్డ్ హైవే ప్రతిపాదనలకు అనుగుణంగా హైదరాబాద్ చెన్నై, హైదరాబాద్- బెంగుళూరు హైస్పీడ్ బుల్లెట్ రైలు ప్రాజెక్టుల సర్వే, అలైన్మెంట్ ప్రతిపాదనలను మరోసారి పరిశీలించాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రైల్వే అధికారులకు సూచించారు. తెలంగాణలో పెండింగ్ లో ఉన్న రైల్వే ప్రాజెక్టులు, లైన్లను వేగవంతంగా పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని ముఖ్యమంత్రి స్ప ష్టం చేశారు. అవసరమైన నిధులను సమకూర్చడంతో పాటు భూ సేకరణకు రాష్ట్ర ప్రభుత్వం సి ద్ధంగా ఉందని చెప్పారు. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ప్రాజెక్టుల అలైన్మెంట్ ఉండాల ని దూరాభారం తగ్గించి, అంచనా ఖర్చును కూ డా తగ్గించుకోవాలని సూచించారు. తెలంగాణ లో పెండింగ్ రైల్వే ప్రాజెక్టులు, భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా చేపట్టాల్సిన ప్రాజెక్టుల వి షయాలపై గురువారం హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో రైల్వేతో పాటు రాష్ట్ర ఉన్నతాధికారులతో రేవంత్రెడ్డి సమీక్ష సమావేశం ని ర్వహించారు.
రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతికి తో డ్పడే ప్రత్యేక రైల్వే లైనుతో పాటు పలు ప్రాజెక్టులను వివరించారు. ప్రయాణికులకు వేగవంతమై న రవాణా సదుపాయాలు అందించటంతో పా టు కొత్తగా వేసే రైలు మార్గాలన్నీ ఆయా ప్రాం తాల సర్వతోముఖాభివృద్ధికి ఉపయోగపడేలా ఉండాలన్నారు.ప్రధానంగా పర్యాటక కేంద్రాలు, పారిశ్రామిక అవసరాలను దృష్టిలో ఉంచుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. విదేశాల తరహాలో రైలు, రోడ్డు, పోర్ట్ కనెక్టివిటీని అధునాతనంగా అభివృద్ధి చేయాలన్నారు. భారత్ ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి మీదుగా బందరు పోర్టు వరకు గ్రీన్ ఫీల్ హైవేతో పాటు అనుసంధానం గా రైల్వే లైన్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి అన్నారు. రాష్ట్ర పునర్విభజన చట్టంలోని హామీ ప్రకారం హైదరాబాద్ నుంచి అమరావతికి ర్యా పిడ్ రైల్ అండ్ రోడ్డు కనెక్టివిటీ ప్రాజెక్టును కేం ద్రం అమలు చేయాల్సి ఉందన్నారు.
Also Read: సోనియా గాంధీకి ఢిల్లీ కోర్టు ఊరట
వీలైనంత తొందరగా ఈ ప్రాజెక్టును చేపట్టేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని రైల్వే అధికారులకు సూచించారు. తెలంగాణ ఇండస్ట్రియల్ సెక్టార్ కోసం ప్రత్యేక రైల్వే లైన్ ఉండేలా ఈ కనెక్టివిటీ ఉండాలన్నారు. వికారాబాద్ – కృష్ణా కొత్త రైల్వే లైన్ పనులను వీలైనంత త్వరగా చేపట్టాలని, దీంతో పాటు గద్వాల్ – డోర్నకల్ రైల్వే లైన్ పనుల డీపీఆర్ పూర్తి చేసి వేగంగా చేపట్టాలన్నారు. వరంగల్ జిల్లాలో రైల్వే లైన్లను అభివృద్ధి చేయాలని, భూపాలపల్లి నుంచి వరంగల్ కొత్త మార్గాన్ని పరిశీలించాలని చెప్పారు. కాజీపేట జంక్షన్లో ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపట్టాలని అన్నారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి , దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్ కుమార్ శ్రీవాస్తవ, ఎంపీ కడియం కావ్య , ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావుతో పాటు ఇతర ఉన్నతాధికారులు, దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారులు పాల్గొన్నారు.