మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో విద్యా వ్యవస్థను మరింత పటిష్టం చేయాల ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారుల ను ఆదేశించారు. అదనపు కలెక్టర్లు వారం లో కనీసం రెండు ప్రభుత్వ పాఠశాలలను సందర్శించాలని సిఎం సూచించారు. వి ద్యా శాఖపై ఐసిసిసిలో సిఎం రేవంత్రెడ్డి బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ ఏ డాది ప్రైవేటు పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో 48 వేల మంది చేరారని అధికారులు సిఎంకు వివరించారు. పెరిగిన విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా నూతన గదులు నిర్మించాలని సిఎం అధికారులను ఆదేశించారు.
ప్ర త్యేక అవసరాలున్న పిల్లలకు అవసరమైన వసతులను పాఠశాలల్లో కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని సిఎం సూచించారు. మధ్యాహ్న భోజ నం తయారీకి సంబంధిం చి గ్యాస్, కట్టెల పొయ్యిల బాధల నుంచి మధ్యాహ్న భోజనం తయారు చేసే మహిళలకు విముక్తి కల్పించాలని సోలార్ కిచెన్ల ఏర్పాటుపై తక్షణమే దృష్టి సారించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.ప దో తరగతిలో ఉత్తీర్ణులవుతున్న విద్యార్థుల సంఖ్యకు, ఇంటర్మీడియట్లో నమోదవుతు న్న విద్యార్థుల సంఖ్య కు మధ్య వ్యత్యాసం ఎక్కువ ఉండడంపై ముఖ్యమంత్రి అధికారులను ప్రశ్నించారు.
పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులంతా కచ్చితంగా ఇంటర్మీడియట్లో చేరే లా చూడాలని సిఎం సూచించా రు.
ఇంటర్మీడియట్ అనంతరం జీవనోపాధికి అవసరమైన స్కిల్ కోర్సుల్లో శిక్షణ పొందవచ్చని తద్వారా వారి జీవితానికి ఢో కా ఉండదని సిఎం అభిప్రాయపడ్డారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి బి.అజిత్ రెడ్డి, విద్యా శాఖ కార్యదర్శి యోగితా రాణా, సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ ఏ.శ్రీదేవసేన, విద్యా శాఖ ప్రత్యేక కార్యదర్శి ఎం.హరిత తదితరులు పాల్గొన్నారు.