వేములవాడ, యాదగిరిగుట్ట, ఎనికేపల్లి, పశుసంవర్ధక వర్శిటీలో
అత్యాధునిక గోశాలల నిర్మాణం వేములవాడలో వంద ఎకరాలకు
తక్కువ కాకుండా గోశాల రాష్ట్రంలో గోరక్షణకు సమగ్ర పాలసీ
అధ్యయనానికి ముగ్గురు అధికారులతో కమిటీ కమిటీ సభ్యులుగా
సబ్యసాచి ఘోష్, శైలజారామయ్యర్, రఘునందన్రావు సమీక్షా
సమావేశంలో సిఎం రేవంత్రెడ్డి సిఎంకు గో సంరక్షణ అప్రోచ్ పేపర్
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలోగో సం రక్షణకు సమగ్ర విధానం రూపొందించాలని సిఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇందుకోసం వివిధ రాష్ట్రాల్లోని విధానాల అధ్యయనానికి ముగ్గురు అధికారులతో ఒక కమిటీని సిఎం నియమించారు. పశు సంవర్ధక శాఖ ప్ర త్యేక ప్రధాన కార్యదర్శి సబ్యసాచి ఘోష్, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్య ర్, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రా వులతో కూడిన కమిటీ ఈ విషయంలో లోతైన అధ్యయనం చేయాలని సిఎం ఆదేశించారు. రా ష్ట్రంలో గో సంరక్షణపై సిఎం రేవంత్రెడ్డి మంగళవారం సాయంత్రం తన నివాసంలో సమీక్ష ని ర్వహించారు. మన సంస్కృతీలో గోవులకు ఉ న్న ప్రాధాన్యం, భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకోవడంతో పాటు గోవుల సంరక్షణే ప్రధానంగా విధానాల రూపకల్పన ఉండాలని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. భక్తులు గోశాలలకు పెద్ద సంఖ్యలో గోవులు దానం చేస్తున్నారని, స్థ లాభావం, ఇతర సమస్యలతో అవి తరచూ మృ త్యువాత పడుతున్నాయని సిఎం ఆవేదన వ్యక్తం చేశారు. ఆ పరిస్థితులను అధిగమించి గోవుల సంరక్షణే ధ్యేయంగా తొలుత రాష్ట్రంలోని నా లుగు ప్రదేశాల్లో ఆధునిక వసతులతో గోశాలలు నిర్మించాలని సిఎం సూచించారు.
ప్రముఖ దేవస్థానాల ఆధ్వర్యంలో కోడె మొక్కులు చెల్లించే వే ములవాడ, యాదగిరిగుట్ట, హైదరాబాద్ నగర సమీపంలోని ఎనికేపల్లి, పశు సంవర్థక శాఖ వి శ్వ విద్యాలయం సమీపంలో విశాల ప్రదేశాల్లో తొలుత గోశాలలు నిర్మించాలని సిఎం సూచించారు. భక్తులు అత్యధిక భక్తిశ్రద్ధలతో సమర్పిం చే కోడెల పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ కనపర్చాలని సిఎం సూచించారు. వేములవాడ సమీపంలో వంద ఎకరాలకు తక్కువ కాకుండా గోశాల ఉండాలని సిఎం తెలిపారు. గో సంరక్షణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎంతటి వ్యయానికైనా వెనుకాడదని సిఎం స్పష్టం చేశారు. అనంతరం రాష్ట్రంలో గోశాలల నిర్వహణకు సంబంధించిన అప్రోచ్ పేపర్ను అధికారులు సిఎంకు అందజేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శులు వి.శేషాద్రి, శ్రీనివాసరాజు, పశుసంవర్ధక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సబ్యసాచి ఘోష్, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజ రామయ్యర్, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, హెచ్ఎండిఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ గోపి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.