పిల్లలకు భాషాపరిజ్ఞానంతోపాటు నైపుణ్యాలు నేర్పించాలి అన్ని పాఠశాల్లో
నిర్దిష్ట సంఖ్యలో విద్యార్థులు ఉండాలి ఈ ఏడాది కొత్తగా 571 పాఠశాలలు
ప్రారంభం ప్రతి లే అవుట్లో పాఠశాలకు స్థలం కేటాయించాలి
డేస్కాలర్స్కూ గురుకుల సదుపాయాలు కల్పించే అంశంపై అధ్యయనం
చేయాలి విద్యాశాఖ సమీక్షాసమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి
మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాల పెంపే తమ లక్ష్యం అని సిఎం రేవంత్రెడ్డి తెలిపారు. ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందాలని… ఇందుకు అవసరమైన మౌలిక వసతులు, ఉపాధ్యాయులకు శి క్షణ, ఇతర సదుపాయాల కల్పనకు ఎంత వ్య యమైనా వెనుకాడేది లేదని సిఎం స్పష్టం చేశా రు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో 20 మంది కన్నా ఎక్కువ పిల్లలు ఉన్న గ్రామీణ, పట్టణ ప్రాం తాల్లో ఈ ఏడాది కొత్తగా 571 పాఠశాలలు ప్రా రంభిస్తున్నామని వెల్లడించారు. పాఠశాలలు పు నః ప్రారంభమైన నేపథ్యంలో ఐసిసిసిలో విద్యాశాఖ అధికారులతో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలో చేరిన ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందేలా వ్యవస్థను తీర్చిదిద్దాలని సిఎం అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలో బోధన ప్రమాణాల పెంపునకు తీసుకోవాల్సిన చర్యలను అధికారులకు సూచించారు. విద్యార్థులకు భాషా పరిజ్ఞానంతో పాటు నైపుణాల పెంపునకు వీలుగా విద్యా వ్యవస్థను మార్పు చేయాలని సిఎం సూచించారు. హైస్కూల్ స్థాయి నుంచే విద్యార్థులకు నైపుణ్యాభివృద్ధి కల్పిస్తే భవిష్యత్తులో వారు తమకు ఇష్టమైన రంగంలో రాణించే అవకాశం ఉంటుందని సిఎం అభిప్రాయపడ్డారు.
లే అవుట్లలో పాఠశాలలు ఏర్పాటు చేయాలి
తెలంగాణలో పట్టణీకరణ వేగంగా సాగుతున్న నేపథ్యంలో విద్యాశాఖ పురపాలక శాఖతో సమన్వయం చేసుకొని హెచ్ఎండిఎ, మున్సిపల్ లే అవుట్లలో సామాజిక వసతుల కోసం గుర్తించిన స్థలాల్లో పాఠశాలలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి న్నారు. ఎస్సి, ఎస్టి, బిసి, మైనారిటీ..ఇలా వివిధ విభాగాల కింద ఇంటర్మీడియేట్ వరకు ఉన్న వివిధ విద్యా సంస్థలను హేతుబద్దీకరించి ప్రతి పాఠశాలలో నిర్ధిష్ట సంఖ్యలో విద్యార్థులు ఉండేలా చూడాలని సిఎం అధికారులను ఆదేశించారు. నాణ్యమైన భోజనం, యూనిఫాంలు, పాఠ్య పుస్తకాలు అందిస్తుండడంతో పెద్ద సంఖ్యలో విద్యార్థులు గురుకులాల వైపు మొగ్గు చూపుతున్నారని..
డే స్కాలర్స్కు ఆ పాఠశాలల్లోనే అవన్నీ అందించే విషయంపై అధ్యయనం చేయాలని అధికారులకు సిఎం సూచించారు. పిల్లలకు కుటుంబం, సమాజం ప్రాధాన్యాన్ని వివరించడంతో పాటు కుటుంబం, సమాజం పట్ల వారి బాధ్యతను తెలియజేసేలా కౌన్సెలింగ్ ఇప్పిస్తే వారు మానసికంగా దృఢంగా తయారవడంతో పాటు బాధ్యతాయుతమైన పౌరులుగా రాణిస్తారని అన్నారు. సమీక్షలో ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కే.కేశవరావు, ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, సిఎం కార్యదర్శి మాణిక్ రాజ్, విద్యా శాఖ కార్యదర్శి యోగితా రాణా, కళాశాల విద్య కమిషనర్ శ్రీదేవసేన, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నరసింహారెడ్డి పాల్గొన్నారు.