Wednesday, June 18, 2025

టార్గెట్ అరవింద్

- Advertisement -
- Advertisement -

ఆయన నిర్వహించిన
విదేశీ, స్వదేశీ
పర్యటనల వివరాలను
సేకరిస్తున్న ప్రభుత్వం
గత ప్రభుత్వంలో
అనేకమార్లు టర్కీ,
సింగపూర్,
థాయ్‌లాండ్‌లకు
టూర్ జిఎడి,
ఇంటెలిజెన్స్‌ల
నుంచి నివేదికలు
కోరిన సర్కార్ గత
ప్రభుత్వంలో ఆయన
చేసిన అవినీతిపై
సమాచార సేకరణ

మన తెలంగాణ/హైదరాబాద్ : ఫార్ములా ఈ రేస్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కు మార్ విదేశీ, స్వదేశీ పర్యటనలపై ప్రభు త్వం ఆరా తీస్తోంది. 2018నుంచి2023 వరకు ఆయన విదేశీ పర్యటనలకు ఎన్నిసార్లు వెళ్లారు, ఎన్నిసార్లు ప్రభుత్వ అనుమతి తీసుకున్నారు, ఏయే రాష్ట్రాలకు, ఏ యే దేశాలకు ఆయన వెళ్లారన్న దానిపై జి ఏడితో పాటు ఇంటెలిజెన్స్ నుంచి నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం సూచించినట్టుగా స మాచారం. ప్రస్తుతం ఆయన విదేశీ పర్యటన నిమిత్తం సెలవు పెట్టారు. ఈ నెలాఖరులోగా ఆయన తిరిగి ఇండియాకు రానున్నారు. ఈ నేపథ్యంలోన ఆయన విదేశీ ప ర్యటనకు సంబంధించి పలు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నివేదికను అడిగినట్టుగా తెలిసింది. ఇప్పటికే ఆ యన గత ప్రభుత్వంలో చేసిన పర్యటనల పై అనేక ఆరోపణలు వెల్లువెత్తుతుండడతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా సమాచారం. గత ప్రభుత్వంలో ఆయన పలు శాఖలకు ఇన్‌చార్జీ అధికారిగా పనిచేశారు.

సుమారుగా ఐదు నుంచి ఆరు శాఖలను చాలా ఏళ్లు ఆయన పర్యవేక్షించారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఆయా శాఖల పేర్లు చెప్పి రాష్ట్ర, విదేశీ పర్యటనలకు వెళ్లినట్టుగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.దీంతోపాటు ఆ శాఖలకు సంబంధించి 7 వాహనాలను ఆయన వాడుకునేవారని, ఎ ప్పుడు ఏ వాహనంలో వెళతారన్నది రహస్యంగా ఉంచేవారని తెలిసింది. దీంతోపా టు ఆయన ఎప్పుడు ఎక్కడ ఉంటారో కూ డా ఎవరికి తెలియకుండా అతి సన్నిహితులకే తన సమాచారం ఇచ్చే వారని, వారికి వాట్సాప్‌లో సూచనలు ఇచ్చేవారని సమాచారం. అనధికారికంగా ఈ పర్యటనలకు వెళ్లినా ఆయన దగ్గర ఉన్న శాఖల నుంచే ఈ ఖర్చులను చెల్లించేవారని తెలుస్తోంది. దీనివల్ల కోట్లలో ప్రభుత్వ ధనం దుర్వినియోగం అయ్యిందని ప్రభుత్వానికి ఫిర్యాదులు అందడం విశేషం.

సెలవు పెట్టకుండానే…..
ఆయనకు గత ప్రభుత్వంలో పలువురు మంత్రులతో దగ్గరి సంబంధాలు ఉండడం, అప్పటి సిఎస్‌తోనూ చనువు ఉండడంతో ఆయన ఏం చేసినా నడిచేదని, అందుకే ఆయన తన పర్యటనల విషయంలో ఒక్కోసారి అధికారికంగా జిఏడి అనుమతి తీసుకునే వారని, ఒక్కోసారి అనుమతి లేకుండా, సెలవు పెట్టకుండానే అనధికారికంగా వెళ్లే వారని ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. అందులో భాగంగా ఈ విషయమై నిజా నిజాలను తెలుసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించినట్టుగా సమాచారం.

టర్కీ, థాయిలాండ్, సింగపూర్‌లతో
అయితే, ఆయన ఎక్కువగా విదేశీ పర్యటనలకు సంబంధించి టర్కీ, థాయిలాండ్, సింగపూర్‌లతో పాటు మన దేశంలోని గోవా, ఢిల్లీ, ఊటీలకు అధికంగా వెళ్లేవారని ఆయన అక్కడకు ఎందుకు వెళ్లారన్నది ప్రశ్నార్థకంగా ఉండేదని, చాలాసార్లు ఈ పర్యటన గురించి ఎవరికీ తెలిసేది కాదని సమాచారం. ఇలా ఆయన కొన్నిసార్లు విదేశీ పర్యటనకు వెళ్లడానికి క్షణాల్లో ఆయనకు జిఏడి అనుమతి ఇచ్చేదని తెలిసింది. దీంతోపాటు ఆయన ఇన్‌చార్జీగా ఉన్న శాఖలకు సంబంధించి పైళ్లకు సంబంధించి సూచనలన్నీ వాట్సాప్ ద్వారానే నడిచేదని, ఆయా శాఖల్లో ఒక్కోక్కరిని తన అనుచరులుగా నియమించుకొని అక్రమ వ్యవహారాలను వారితో నడిపేవారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలోనూ ఆయన ఢిల్లీలోని తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా పనిచేసినప్పుడు తనకు కేటాయించిన నివాస భవనాన్ని 2023 వరకు అలాగే పెట్టుకున్నారని, నెలలో చాలాసార్లు ఢిల్లీలోని ఆ భవనంలో అనధికారిక కార్యక్రమాలను ఆయన నిర్వహించేవారన్న ఆరోపణలు వెల్లువెత్తుతు న్నాయి.

ఏజెన్సీ నిర్వాహకుడికి అందలం
గత ప్రభుత్వంలో ఆయన ఐ అండ్ పిఆర్ కమిషనర్‌గా సైతం పనిచేశారు. ఆ సమయంలోనూ ఆ శాఖలో చాలా అవినీతి జరిగిందన్న ఫిర్యాదులు ప్రభుత్వానికి అందాయి. జిల్లాలో సిఎం పర్యటించినప్పుడు రూ.16 కోట్లతో సౌండ్ సిస్టమ్‌ను, దానికి సంబంధించిన పరికరాలు, వాహనాలను కొనుగోలు చేయగా, హైదరాబాద్‌లోనూ మరో సిస్టమ్ ఉండాలని, దీనికోసం మళ్లీ సుమారుగా రూ.10 నుంచి రూ.12 కోట్ల ప్రజాధనాన్ని ఆయన దుర్వినియోగం చేశారని, దీనిపై నాంపల్లి ఏసిబి కోర్టులోనూ కేసు నడుస్తోందని తెలుస్తోంది. ఈ కొనుగోళ్లలోనూ అనేక అక్రమాలు జరిగాయని ఆధారాలతో కొందరు ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినట్టుగా తెలిసింది.

విద్యా సంవత్సరాన్ని కోల్పోయిన విద్యార్థులు
కొంతకాలం ఉస్మానియా యూనివర్శిటీ ఇన్‌చార్జీ విసిగా ఉన్నప్పుడు ఆయన సంతకం చేయకపోవడం వల్ల విద్యార్థులకు సంబంధించి ఫలితాలను వెల్లడించలేదని దీనివల్ల విద్యార్థులు తమ విద్యా సంవత్సరాన్ని కోల్పోయారని తెలిసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News