కాళేశ్వరంపై ఎన్డిఎస్ఎ
నివేదికను ఎల్ అండ్ టి
తిరస్కరించడమే ఇందుకు
నిదర్శనం క్రూర
రాజకీయ అజెండాతోనే
హస్తినలో నివేదిక తయారీ
కనీస పరీక్షలు చేయకుండా,
శాస్త్రీయ డేటా లేకుండా
నివేదిక ఇవ్వడం ఏమిటి?
బిఆర్ఎస్ను బద్నాం
చేయడానికే ఈ దుర్మార్గాలు
బిఆర్ఎస్ వర్కింగ్
ప్రెసిడెంట్ కెటిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్ : కాళేశ్వ రం ప్రాజెక్టు ముమ్మాటికి చీప్ క్వాలిటీది కాదని, తెలంగాణ కాంగ్రెస్, బిజెపి చేస్తు న్న రాజకీయాలే చీప్ అని బిఆర్ఎస్ వ ర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ విమర్శించా రు. కనీస పరీక్షలు చేయకుండా, ఎలాంటి శాస్త్రీయ డేటాను సేకరించకుండానే తయారు చేసిన ఎన్డిఎస్ఎ రిపోర్ట్ను ప్రపంచ ప్రఖ్యాత నిర్మా ణ సంస్థ ఎల్ అండ్ టి తిరస్కరించడమే ఇందుకు సాక్ష్యమని ఒక ప్రకటనలో పే ర్కొన్నారు. బిఆర్ఎస్ను బద్నాం చేయడానికే కేంద్ర ప్రభుత్వ సంస్థ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, ఓ అశాస్త్రీయ నివేదికను ఇచ్చిందన్న నిజం మరోసారి ప్ర పంచానికి తెలిసిందని వ్యాఖ్యానించారు. నాడు అసెంబ్లీ ఎన్నికల సమయంలో బిఆర్ఎస్పై బురదజల్లేందుకు కుట్రలు చేసిన కాంగ్రెస్ బిజెపి పార్టీలు..ఇటీవల బిఆర్ఎస్ రజతోత్సవ సభను దెబ్బతీయాలన్న కుతంత్రాలతోనే తుది నివేదిక పేరిట నయా డ్రామాకు తెరతీశాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోతికి కొబ్బరిచిప్ప దొరికినట్టు ఆ తప్పుల తడక నివేదికతో కాంగ్రెస్,బిజెపిలు ప్రపంచంలోనే అతిపెద్ద బహుళ-దశల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రా జెక్ట్ కాళేశ్వరంపై అబద్దాలు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు.
మేడిగడ్డ బ్యారేజీపై ఎన్డిఎస్ఎ ఇచ్చిన నివేదిక అంతా బూటకమని ఇప్పటిదాకా బిఆర్ఎస్ చెబుతున్న మాటే అక్షరాలా నిజమన్న సంగతి ఎల్ అండ్ టి తాజా నిర్ణయంతో మరోసారి ప్రజలకు తెలిసిందని అన్నారు. కేవలం ఓ నీచమైన ఊహ ఆధారంగా క్రూరమైన రాజకీయ ఎజెండాతో ఢిల్లీలోని కాంగ్రెస్,బిజెపి కేంద్ర కార్యాలయాల్లో ఆ రిపోర్ట్ను తయారుచేశారని ఆరోపించారు. ఎన్డిఎస్ఎ నివేదికను ఎన్డిఎ నివేదిక అని తాము పిలవడంలో ఎలాంటి తప్పు లేదని పేర్కొన్నా రు. ఇలాంటి పనికిరాని రిపోర్టును పట్టుకుని ఎన్డిఎస్ఎ నివేదికనే తమకు ప్రా మాణికమని ముఖ్యమంత్రి రేవంత్, రా ష్ట్ర ప్రభుత్వం చెప్పడం వారి అసమర్థత కు,చేతకానితనానికి, దివాలాకోరు విధా నాలకు నిదర్శనమని మండిపడ్డారు. కెసిఆర్కు పేరొస్తుందనే రాజకీయ దుగ్ధతోనే ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అయిన కాళేశ్వరంను పక్కనపెట్టి సిఎం రేవంత్ క్షమించరాని పాపం చేశారని విమర్శించారు. ముఖ్యమంత్రి నిర్వాకంతో ఏడాదిన్నరగా రాష్ట్రంలోని లక్షలాది ఎకరాల్లో పంటలు ఎండిపోయి 500 మందికి పైగా అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
రేవంత్ రెడ్డి రాష్ట్ర రైతులకు క్షమాపణ చెప్పాలి
క్షేత్రస్థాయిలో కనీస పరీక్షలు చేయకుండా ఎన్డిఎస్ఎ ఇచ్చిన నివేదికను ఎల్ అండ్ టి పూర్తిగా తిరస్కరించడం రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారుకు, కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి చెంపపెట్టు అని కెటిఆర్ పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టులో డయాఫ్రం వాల్ కొట్టుకుపోయినా శరవేగంగా పునరుద్ధరించిన సంగతి మరిచిపోయి, మేడిగడ్డ విషయంలో మాత్రం 18 నెలలుగా మొత్తం ప్రాజెక్టునే కోల్డ్ స్టోరేజీలోకి నెట్టడం అత్యంత దుర్మార్గమని మండిపడ్డారు. ప్రాజెక్టు ప్రణాళికల నుంచి నిర్మాణం వరకు నాణ్యతలో ఎక్కడా రాజీ పడకుండా కట్టిన కాళేశ్వరంపై బురదజల్లడం మాని, ఇకనైనా ఎల్ అండ్ టి అభ్యంతరాలకు ప్రభుత్వం, ఎన్డిఎఎస్ఎ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ఎన్డిఎస్ఎ వాదనలన్నీ తప్పుల తడక అని తేలిపోయిన నేపథ్యంలో.. దీన్ని కుంటిసాకుగా చూపి దాటవేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర రైతులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని అన్నారు. ఇకనైనా పోలవరం తరహాలో పునరుద్ధరణ చర్యలు చేపట్టి తెలంగాణ రైతుల సాగునీటి కష్టాలను తీర్చాలని సూచించారు. లేకుంటే కాళేశ్వరం ప్రాజెక్టుపై ముఖ్యమంత్రితో పాటు కాంగ్రెస్- బిజెపి పార్టీలు చేస్తున్న కుట్ర రాజకీయాలకు తెలంగాణ రైతులు తగిన గుణపాఠం చెపుతారని హెచ్చరించారు. ఎవరు ఎన్ని కుట్ర సిద్ధాంతాలను సృష్టించినా.. వాస్తవం మాత్రం చెక్కు చెదరకుండా ఉంటుందని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు జీవనాడి అయితే కెసిఆర్ దార్శనికుడు అని కెటిఆర్ వ్యాఖ్యానించారు.