Wednesday, June 18, 2025

కృష్ణా జలాలపై మరణశాసనం రాసిందే బిఆర్‌ఎస్

- Advertisement -
- Advertisement -

కృష్ణా జలాలపై మరణశాసనం రాసిందే బిఆర్‌ఎస్ పాలకులని సిఎం రేవంత్‌రెడ్డి విమర్శించారు. 811 టిఎంసీల కృష్ణా జలాల్లో 299 సరిపోతాయని సంతకం పెట్టిందే బిఆర్‌ఎస్ ప్రభుత్వమన్నారు. ఇదే విషయాన్ని నామా నాగేశ్వర రావు చెప్పారన్నారు. నిజంగా ప్రాజెక్టులపై చిత్తశుద్ధి ఉంటే ఢిల్లీలో ధర్నా చేయాలని రేవంత్‌రెడ్డి అన్నారు. కృష్ణా ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించిందే బిఆర్‌ఎస్ సర్కార్‌దని ఆయన ఆరోపించారు. కాళేశ్వరం అవినీతి బయటపడటంతో కెఆర్‌ఎంబికి అప్పగించారంటూ తమ ప్రభుత్వంపై బురద జల్లేందుకు ప్రయత్నిస్తున్నారని రేవంత్ రెడ్డి అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News