Wednesday, June 4, 2025

ఆడబిడ్డలకే ఇందిరమ్మ ఇళ్లు: సిఎం రేవంత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయాలనేది తమ ఆలోచన అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సోమవారం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో జాతీయ జెండా ఆవిష్కరించిన అనంతరం ప్రజలనుద్దేశించి సిఎం మాట్లాడారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో మహిళలకు పెద్దపీట వేశామని చెప్పారు. మహిళా సంఘాల ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయం కల్పించామని.. మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పించామని తెలిపారు. రాష్ట్రంలో చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ ఆడబిడ్డలకే కేటాయిస్తున్నామని చెప్పారు. ఇక, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు చర్యలు తీసుకున్నామని.. శాస్త్రీయంగా కులగణన నిర్వహించి బీసీల లెక్క 50.36 శాతంగా తేల్చామని సిఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News