- Advertisement -
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బుధవారం ఉదయం ఢిల్లీ పర్యటనకు వెళుతున్నారు. రెండు రోజుల పాటు ఆయన అక్కడే పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న తరుణంలో పార్టీ ఎంపీలతో ఢిల్లీలో సమావేశం కానున్నారు. బీసీ కులగణన సర్వేపై ఎంపీలకు పవర్పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇవ్వనున్నట్లు సమాచారం. అలాగే బీసీ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఆమోదం కోసం కేంద్రంపై ఒత్తిడి చేసేలా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది.
- Advertisement -