Tuesday, June 10, 2025

ఇవాళ ఖర్గేతో భేటీ కానున్న సిఎం రేవంత్.. మంత్రుల శాఖలపై నిర్ణయం

- Advertisement -
- Advertisement -

తెలంగాణలో కొత్తగా ముగ్గురు మంత్రులు ప్రమాణ స్వీకారం చేయడంతో వారికి ఏయే శాఖలు కేటాయిస్తారన్న విషయమై ప్రస్తుతం రాష్ట్రంలో చర్చనీయాశంగా మారింది. సిఎం రేవంత్ రెడ్డి వద్ద ఉన్న శాఖలనే కొత్త మంత్రులకు కేటాయిస్తారా లేక మొత్తం మంత్రుల దగ్గర ఉన్న శాఖలను ప్రక్షాళన చేస్తారా అన్నది రాష్ట్రంలో ఉత్కంఠగా మారింది. ఈక్రమంలో ముగ్గురు మంత్రులకు శాఖల కేటాయింపుపై సిఎం రేవంత్ రెడ్డి.. అధిష్టానంతో చర్చించేందుకు సోమవారం ఢిల్లీకి వెళ్లారు. మంగళవారం కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో సిఎం రేవంత్ రెడ్డి భేటీకానున్నారు. తర్వాత రాహుల్ గాంధీని సిఎం కలిసే అవకాశం ఉంది. ఈ సందర్భంగా ముగ్గురు కొత్త మంత్రులకు శాఖల కేటాయింపుపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

కాగా, నిన్న కెసి వేణుగోపాల్‌తో సిఎం రేవంత్‌రెడ్డి కలిసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కార్పొరేషన్ పదవులు, పిసిసి కార్యవర్గం తదితర అంశాలపై ఆయనతో సిఎం చర్చించారు. చీఫ్ విప్ పదవితో పాటు రెండు విప్ పదవులు, మరో మూడు మంత్రి పదవుల భర్తీ గురించి కెసి వేణుగోపాల్‌తో సిఎం చర్చించినట్టుగా సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News