Thursday, May 1, 2025

కార్మికులకు మే డే శుభాకాంక్షలు తెలిపిన సిఎం రేవంత్

- Advertisement -
- Advertisement -

అంతర్జాతీయ కార్మిక దినోత్సవం, మే డే సందర్భంగా ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి కార్మిక లోకానికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా ప్రభుత్వ పాలనలో అంతర్జాతీయ కార్మిక దినోత్సవ స్ఫూర్తి అన్ని రంగాలకు విస్తరిస్తుందని, కార్మికులకు సముచిత గౌరవం లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. శ్రామికులే అభివృద్ధిలో అసలైన భాగస్వామ్యులని, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే నూతన పారిశ్రామిక విధానం శ్రామికుల అభ్యున్నతికి దోహదపడుతుందని ఆయన అన్నారు. కార్మికుల శ్రేయస్సు, సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తుందన్నారు. మే డే స్ఫూర్తితో ప్రజా ప్రభుత్వం అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తుందన్నారు. అధికారం చేపట్టిన వెంటనే అసంఘటిత రంగంలో పని చేస్తున్న గిగ్ వర్కర్ల కోసం రూ.5 లక్షల ప్రమాద బీమా అమలు చేసిందన్నారు. తెలంగాణ గిగ్, ప్లాట్ ఫాం వర్కర్స్ సంక్షేమ బిల్లు -2025 త్వరలో తీసుకువస్తామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News