- Advertisement -
బెంగళూరు: ఎం చిన్నస్వామి స్టేడియంలో జరిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) విజయోత్సవ పరేడ్ సందర్భంగా జరిగిన విషాదకరమైన తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబాలకు నష్టపరిహారాన్ని కర్ణాటక ప్రభుత్వం పెంచింది. కానీ ప్రజల నిరసనల నేపథ్యంలో మొదట్లో.. మరణించిన ప్రతి కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం ప్రకటించింది. తాజాగా పరిహారాన్ని రూ. 25 లక్షలకు పెంచినట్లు ప్రభుత్వం తెలిపింది.
ఈ తొక్కిసలాటలో 11 మంది ప్రాణాలు కోల్పోగా, 33 మంది గాయపడ్డారు. ఊహించని విధంగా RCB ఐపిఎల్ విజయాన్ని జరుపుకోవడానికి పెద్ద సంఖ్యలో అభిమానులు చిన్నస్వామి స్టేడియానికి వచ్చారు. దాదాపు 35,000 మంది కూర్చునే సామర్థ్యం ఉన్న స్టేడియంలో 2 నుండి 3 లక్షల మంది జనం ఉండటంతో పరిస్థితి అదుపుతప్పి తొక్కిసలాట జరిగింది.
- Advertisement -