Monday, June 9, 2025

కొలంబియా సెనేటర్‌పై కాల్పులు..పరిస్థితి విషమం

- Advertisement -
- Advertisement -

ఎన్నికల ప్రచార ర్యాలీ సందర్భంగా బొగోటాలో శనివారం కొలంబియా సెనేటర్ మిగ్యుల్ ఉరిబ్ టర్బే(39)పై కాల్పులు జరిగాయని, ఆయన గాయపడ్డారని అధికారులు తెలిపారు. ‘ఇది ఆమోయోగ్యం కాని హింసాత్మక చర్య’ అని ఆయన కన్జర్వేటివ్ డెమోక్రటిక్ సెంటర్ పార్టీ ఓ ప్రకటన విడుదలచేసింది. ఫోంటిబాన్ పరసర ప్రాంతంలోని పార్క్ వద్ద ఈ దాడి జరిగింది. రక్తమోడుతున్న ఉరిబ్ టర్బేను అనేకులు మోసుకెళుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో సర్కూలేట్ అవుతోంది.

ఆయన భార్య మరియా క్లాడియా టరజోనా తన ‘ఎక్స్’ ఖాతాలో ‘ఆయన ప్రాణాల కోసం పోరాడుతున్నారు’ అని రాశారు. వచ్చే ఏడాది కొలంబియాలో జరిగే ఎన్నికల్లో టర్బే అధ్యక్ష అభ్యర్థిగా పోటీచేయనున్నారు. ఈ ఘాతుకానికి బాధ్యులైన వారిని పట్టుకోవడంలో సాయపడే వారికి కొలంబియా ప్రభుత్వం రివార్డును కూడా ప్రకటించింది. ఉరిబ్ టర్బే ఓ పాత్రికేయుడి కుమారుడు. ఆయన తండ్రిని 1991లో అపహరించి చంపేశారు. అప్పట్లో ఆ దేశంలో పెద్ద ఎత్తున హింసాకాండ చెలరేగింది. ఇక కొలంబియాలో 2026 మే 31న అధ్యక్ష ఎన్నికలు జరుగనున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News