- Advertisement -
బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన నేపథ్యంలో విరాట్ కోహ్లిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తొక్కిసలాట ఘటనకు కోహ్లీ కూడా కారణమని ఆరోపిస్తూ రియల్ ఫైటర్స్ ఫోరం అధ్యక్షుడు వెంకటేశ్ కబ్బన్ పార్క్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనలో ఇప్పటికే ఆర్సిబి యాజమాన్యంపై పోలీసులు కేసు నమోదు చేశారు. మరి కోహ్లీపై కేసు నమోదు చేస్తారా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది.
కాగా, ఆర్సీబి విజయోత్సవ ర్యాలీ సందర్భంగా భారీగా తరలివచ్చిన అభిమానులు ఒక్కసారిగా తోసుకుంటూ చిన్నస్వామి స్టేడియం లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో 11 మంది అభిమానులు ప్రాణాలు కోల్పోయారు. మరో 50 మందికి పైగా గాయపడ్డారు. మృతుల కుటుంబాలకు కర్ణాటక ప్రభుత్వం రూ. 10 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది.
- Advertisement -