Sunday, June 22, 2025

రేషన్ కార్డు కోసం లంచం

- Advertisement -
- Advertisement -

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ తహసీల్దార్ కార్యాలయ కంప్యూటర్ ఆపరేటర్ చిట్టెంశెట్టి నవక్రాంత్ శనివారం అవినీతిని నిరోధిక శాఖ అధికారులకు పట్టుబడ్డాడు. ఫిర్యాదుదారుని బంధువుకు సంబంధించి కొత్త రేషన్ కార్డు పొందే ప్రక్రియలో ఆన్‌లైన్ పోర్టల్‌లో దరఖాస్తు అప్లోడ్ చేసి, సంబంధిత అధికారులకు జారీకి పంపించేందుకు చట్టబద్ధమైన సహాయం చేయాల్సి ఉంది. ఇందుకు ఆయన రూ.2,500- లంచంగా డిమాండ్ చేశాడు. డబ్బు డిజిటల్ పద్ధతిలో తీసుకుంటుండగా, ఇదే విషయాన్ని ఆధారంగా తీసుకొని ఎసిబి అధికారుల బృందం అతనిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది. అంతేకాకుండా రేషన్ కార్డు దరఖాస్తుల సహాయానికి, ఇతర పౌర సేవలకు లంచాలు వసూలు చేయడం ఇతనికి పరిపాటి అని కూడా సమాచారం అందింది. డిజిటల్ చెల్లింపుల రూపంలో తరచూ డబ్బులు వసూలు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News