అమరావతి: కేంద్ర మంత్రికి బనకచర్ల చట్ట వ్యతిరేకమైన ప్రాజెక్టు అని వివరించామని తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. బనకచర్లపై ఆందోళనలను కేంద్ర మంత్రికి చెప్పామని అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బనకచర్లపై రాష్ట్ర ప్రజల్లో, రైతుల్లో ఆందోళనలు ఉన్నాయని, తమ ఆందోళనను పరిగణలోకి తీసుకుంటామని కేంద్రమంత్రి చెప్పారని ఉత్తమ్ కుమార్ అన్నారు. కృష్ణా ట్రైబ్యునల్ (Krishna Tribunal) తీర్పు త్వరగా వచ్చేలా చూడమని కోరామని చెప్పారు. ఇచ్చంపల్లి నాగార్జునసాగర్ లింకుతో పెన్నా బేసిన్ కు నీరు తీసుకెళ్ళొచ్చునని, ఇచ్చంపల్లి సాగర్ లింకు అంశంపై చర్చకు సిద్ధమని చెప్పామని తెలియజేశారు. అతిత్వరలో ఇరు తెలుగు రాష్ట్రాల సిఎంల భేటీ ఏర్పాటు చేస్తామని కేంద్రమంత్రి పాటిల్ చెప్పారని పేర్కొన్నారు. అనేక తెలంగాణ ప్రాజెక్టులు కేంద్రం అనుమతి కోసం చూస్తున్నాయని, తమ ప్రాజెక్టుల కంటే ఎపి ప్రాజెక్టులకే త్వరగా అనుమతులిస్తున్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.
బనకచర్లపై ఆందోళనలను కేంద్ర మంత్రికి చెప్పాం: ఉత్తమ్
- Advertisement -
- Advertisement -
- Advertisement -