ఐదు కమిటీలను ప్రకటించిన ఎఐసిసి
పొలిటికల్ అఫైర్స్, అడ్వయిజరి
కమిటీలకు మీనాక్షి సారథ్యం
క్రమశిక్షణ సంఘం చైర్మన్గా మల్లు
రవి డీలిమిటేషన్ కమిటీకి
చల్లా వంశీచంద్రెడ్డి, సంవిధాన్
బచావో ప్రోగ్రామ్ కమిటీకి వినయ్
కుమార్ నేతృత్వం ఉత్తర్వులు జారీ
వేణుగోపాల్ ఆదేశాలు జారీ చేశారు.
మనతెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్కు ఐదు కమిటీలను ఏఐసిసి గురువారం ప్రకటించింది. దీనికి సంబంధించి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీ కెసి వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కమిటీల్లో పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ, అడ్వయిజరీ కమిటీ, డీలిమిటేషన్ కమిటీ, సంవిధాన్ బచావో ప్రోగ్రాం కమిటీతో పాటు క్రమశిక్షణా కమిటీలను ఏర్పా టు చేస్తూ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీలో
పొలిటికల్ ఎఫైర్స్ కమిటీలో మీనాక్షి నటరాజన్, పిసిసి అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్, సిఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహా, శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, మాజీ ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి, ఎంపిలు రేణుకా చౌదరి, బలరాం నాయక్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఎమ్మెల్యేలు ఆది శ్రీనివాస్, వి.శ్రీహరి ముదిరాజ్, బీర్ల అయిలయ్య, కె.ప్రేమ్సాగర్ రావు, సుదర్శన్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు జెట్టి కుసుమ కుమార్, ఈరావతి అనిల్కుమార్లతో పాటు ఎక్స్ అఫిషీయో మెంబర్లుగా నలుగురిని నియమించారు.
అడ్వయిజరీ కమిటీలో…
అడ్వయిజరీ కమిటీలో మీనాక్షి నటరాజన్, పిసిసి అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్, సిఎం రేవంత్రెడ్డి, వి.హనుమంతరావు, కె.జానారెడ్డి, కె.కేశవరావు, మధుయాష్కీ గౌడ్, జి.చిన్నారెడ్డి, జె.గీతారెడ్డి, ఎం.అంజన్కుమార్ యాదవ్, జగ్గారెడ్డి, జాఫర్ జావీద్, టి.జీవన్రెడ్డి, సిరిసిల్ల రాజయ్య, రాములు నాయక్లను ఈ కమిటీలో నియమించారు.
డీ లిమిటేషన్ కమిటీ చైర్మన్గా..
డీ లిమిటేషన్ కమిటీ చైర్మన్గా చల్లా వంశీచంద్ రెడ్డి, గద్వాల విజయలక్ష్మి, ఆది శ్రీనివాస్, కవ్వంపల్లి సత్యనారాయణ, డాక్టర్ శ్రావణ్కుమార్ రెడ్డి, పవన్ మల్లాడి, డి.వెంకటరమణలను ఏఐసిసి నియమించింది.
క్రమశిక్షణా కమిటీ చైర్మన్గా…
క్రమశిక్షణా కమిటీ చైర్మన్గా మల్లు రవి, వైస్ చైర్మన్గా శ్యాం మోహన్, సభ్యులుగా ఎం.నిరంజన్ రెడ్డి, బి.కమలాకర్ రావు, జాఫర్ జావేద్, డా.జివి రామకృష్ణలను జాతీయ కాంగ్రెస్ నియమించింది.
సంవిధాన్ బచావో ప్రోగ్రాం కమిటీ…
సంవిధాన్ బచావో ప్రోగ్రాం కమిటీ చైర్మన్గా పి.వినయ్కుమార్, సభ్యులుగా అద్దంకి దయాకర్, కె.శంకరయ్య, బాలు నాయక్, అరికెట నర్సిరెడ్డి, ఆత్రం సుగుణ, రాచమల్ల సిద్ధేశ్వర్, సంతోష్ కోల్కొండ, పి. అనిల్కుమార్, జూలూరి ధనలక్ష్మి, మాజిద్ ఖాన్, జి.రాములు, అర్జున్ రావు, శౌరి. కె.వల్లభరెడ్డి, వి.శ్రీకాంత్ రెడ్డిలను నియమించారు.