- Advertisement -
హైదరాబాద్: రైతులకు ఎంతో ఉపయోగపడే భూభారతి చట్టాన్ని జాగ్రత్తగా రూపకల్పన చేశామని తెలంగాణ డిప్యూటీ సిఎం భట్టివిక్రమార్క (Bhattivikram Marka) తెలిపారు. అత్యంత పారదర్శకమైన ఈ చట్టాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిందని అన్నారు. ఈ సందర్భంగా ఖమ్మం జిల్లా- ఎర్రుపాలెం సదస్సులో ఆయన మాట్లాడుతూ.. కొత్త చట్టాలపై రైతులకు అవగాహన కల్పిస్తూ సదస్సులు కూడా నిర్వహిస్తున్నామని, గతంలో భూమికి రకం కట్టడం వల్ల రైతులకు భూమి ఎంత ఉందో తెలిసేది అని చెప్పారు. ఏటా రకం కట్టడం వల్ల రికార్డుల్లో (records) భూమి మారితే వెంటనే రైతులకు తెలిసేదని, గత ప్రభుత్వ నిర్వాకం వల్ల రైతులకు వివరాలు తెలియకుండా పోయిందని భట్టి విమర్శించారు.
- Advertisement -