- Advertisement -
బిఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు, మాజీ మంత్రి కె. తారక రామారావు నాటి నిజాం ప్రభువులను మించి పోయారని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి గజ్జెల కాంతం విమర్శించారు. భార్య-భర్తల ఫోన్ ట్యాపింగ్ చేయించారని ఆయన శుక్రవారం విలేఖరుల సమావేశంలో దుయ్యబట్టారు. డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని ఆయన తెలిపారు. బిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కెటిఆర్ డ్రగ్స్ వినియోగాన్ని పెంచారని, కొంత మంది యువతకు అలవాటు చేశారని, చివరకు సినీ రంగాన్ని వదలలేదని, దీంతో పది వేల కోట్ల రూపాయలు ఆర్జించారని ఆయన ఆరోపించారు. గంజాయ్, ఇసుక దేనిని కెటిఆర్ వదిలి పెట్టలేదని ఆయన విమర్శించారు.
- Advertisement -