Friday, May 30, 2025

మిషన్ మీనాక్షి

- Advertisement -
- Advertisement -

జిల్లాల్లో పార్టీ పరిస్థితి ఎలా ఉంది..? గ్రూపు విభేదాలను వీడండి
ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరుతున్నాయా లేదా? పార్టీ
పటిష్టతకు కృషి చేయండి పార్లమెంట్ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు,
ఎంపిలకు రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్ సూచన
నేడు కూడా పలు నియోజకవర్గాల నేతలతో సమావేశం

మనతెలంగాణ/హైదరాబాద్: స్థానిక సం స్థల ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అ ధిష్టానం పార్టీ వ్యవహారాల దృష్టి సారించిం ది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ బుధవారం 7 పా ర్లమెంట్ నియోజకవర్గాల ఎంపిలు, ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జీలతో సమావేశమయ్యారు. ఆయా నియోజకవర్గాల పరిధిలో పార్టీ పరిస్థితులపై ఆమె ఆరా తీశారు. గ్రూపు విభేదాలను వీడనాడాలని ఆమె ఎంపిలు, ఎ మ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు హితవు పలికారు. పనిలో పనిగా మంత్రి పదవి ఆశిస్తున్న ఎ మ్మెల్యేలు, నామినేటెడ్ పోస్టులు, పార్టీ పదవులు ఆశిస్తున్న నాయకులు మీనాక్షిని కలి సి తమకు పదవులను కేటాయించాలని వి జ్ఞప్తి చేశారు. 7 పార్లమెంట్ నియోజకవర్గా ల పరిధిలోని నేతలతో 7 పార్లమెంట్ ని యోజకవర్గాల పరిధిలోని నేతలతో రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ బుధవారం సమావేశం అయ్యారు. హైదరాబాద్‌లోని హైదర్‌గూడలోని ఆమె క్యాంపు కార్యాలయంలో ఈ సందర్భంగా పలువురు ఎమ్మెల్యేలు, ఎంపిలతో మీనాక్షినటరాజన్ భేటీ అయ్యారు.

ఆయా నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితులపై ఆమె ఆరా తీశారు. గ్రూపు విభేదాలను వీడాలని ఆమె నాయకులకు సూచించారు. ఈ నేపథ్యంలోనే మీనాక్షి నటరాజన్ ఎమ్మెల్యేలు, ఎంపిలతో విడివిడిగా సమావేశమయ్యారు. ఒక్కొక్కరికీ సుమారుగా 10 నిమిషాల సమయాన్ని ఆమె కేటాయించారు. ఈ భేటీలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థులు సైతం ఉన్నారు. ఆదిలాబాద్, పెద్దపల్లి, కరీంనగర్, నిజా మాబాద్, జహీరాబాద్, మెదక్, మల్కాజిగిరి లోక్‌సభ స్థానాల పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎంపిలు, పోటీ చేసిన అభ్యర్థులతో ఆమె భేటీ అయి ప్రభుత్వం, పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యల గురించి ఆమె వారితో చర్చించారు. వారు ఇచ్చిన సలహాలు, సూచనలను సైతం ఆమె పరిగణలోకి తీసుకున్నారు. నేడు కూడా పలు పార్లమెంట్ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, ఎంపిలతో మీనాక్షి భేటీ కానున్నారు. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బుధవారం సాయంత్రం రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జీ మీనాక్షితో సమావేశమై పలు అంశాల గురించి చర్చించినట్టుగా సమాచారం. జహీరాబాద్ పార్లమెంట్ పరిస్థితుల గురించి దామోదర రాజనర్సింహాను మీనాక్షి అడిగి తెలుసుకున్నారు.

పార్టీలో గ్రూపు విభేదాలు వీడండి..?
గ్రూపు విభేదాలు వీడి అందరూ సమన్వయంతో పనిచేయాలని మీనాక్షి నటరాజన్ ఆదేశించారు. ముందుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నాయకులతో మీనాక్షి సమావేశమయ్యారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మనకు ప్రత్యర్ధి పార్టీ బిజెపినా లేక బిఆర్‌ఎస్ పార్టీనా అని ఆ జిల్లా నాయకులను మీనాక్షి ప్రశ్నించారు. సమస్యలు ఏమైనా ఉంటే లేఖ రూపంలో ఇవ్వాలని ఎమ్మెల్యేలు, ఎంపిలకు మీనాక్షి నటరాజన్ సూచించారు. భవిష్యత్‌లో పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలన్న దానిపై ఆమె వారికి పలు సూచనలు చేశారు. పార్టీ బలోపేతం ఎలాంటి ప్రణాళికలు రూపొందిస్తున్నారో చెప్పాలని ఆమె సూచించారు. ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి ఏ విధంగా పోతున్నాయి, పేదలకు అందుతున్నాయా లేదా అన్న విషయాల గురించి కూడా ఆమె ఆరా తీశారు. డిసిసి అధ్యక్ష పదవులను త్వరలోనే ప్రకటిస్తామని ఆమె వారితో పేర్కొన్నారు. కష్టపడ్డ వారికి కచ్చితంగా న్యాయం చేస్తామని ఆమె హామీనిచ్చారు.

మంత్రి శ్రీధర్‌బాబు, ఎంపిల మధ్య ఎందుకు వివాదం నెలకొంది..?
ముఖ్యంగా ఐటీ, పరిశ్రమల మంత్రి శ్రీధర్‌బాబుతో ఎంపి గడ్డం వంశీకి నెలకొన్న విభేదాల గురించి మీనాక్షి నటరాజన్ ఆరా తీశారు. ఈ విషయానికి సంబంధించి ఎంపి గడ్డం వంశీతో పాటు ఎమ్మెల్యే వివేక్ మీనాక్షి నటరాజన్‌కు పలు అంశాలను తెలియచేశారు. సరస్వతీ పుష్కరాలకు సంబంధించి ఫ్రొటోకాల్ వివాదంతో పాటు పలు అంశాల్లో తాము వివక్షకు గురవుతున్నామని మీనాక్షి ఎదుట వారు వాపోయినట్టుగా తెలిసింది. దీంతోపాటు తనకు మంత్రి పదవి ఇవ్వాలని ఎమ్మెల్యే వివేక్ మీనాక్షి నటరాజన్‌కు విజ్ఞప్తి చేసినట్టుగా సమాచారం. ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్ కూడా మీనాక్షి నటరాజన్‌ను కలిశారు. తాను 30 ఏళ్లుగా పార్టీలో పనిచేస్తున్నానని తనకు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి లేదా మంత్రి ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ఆదిలాబాద్ జిల్లా అధ్యక్ష పదవి నాకే ఇవ్వాలి
ఆదిలాబాద్ జిల్లా అధ్యక్ష పదవి తనకే ఇవ్వాలని కంది శ్రీనివాస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జీ మీనాక్షి నటరాజన్‌కు విజ్ఞప్తి చేసినట్టుగా సమాచారం. ఆదిలాబాద్‌లో పార్టీ ఎందుకు వెనుకంజలో ఉందని, పార్టీ పటిష్టతకు ఎలాంటి చర్యలు చేపడుతున్నారన్న అంశాల గురించి మీనాక్షి కంది శ్రీనివాస్‌ను అడిగి తెలుసుకున్నారు.

నాకు మంత్రి పదవి ఇవ్వండి: ప్రేమ్‌సాగర్ రావు
ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావు తనకు మంత్రి పదవి ఇవ్వాలని మీనాక్షి నటరాజన్‌కు విజ్ఞప్తి చేశారు. తాను పార్టీనే నమ్ముకొని ఉన్నానని, తాను సీనియర్‌నని ఆయన మీనాక్షితో తెలిపారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తాను మీనాక్షికి చెప్పాల్సింది చెప్పానని ఆయన పేర్కొన్నారు. తనను 12 గంటలకు రమ్మంటే పది నిమిషాల ముందే హాజరయ్యాయని ఆయన తెలిపారు. తాను ఎవరి వద్ద లొంగి మాట్లాడనని ఆయన పేర్కొన్నారు. సిఎం దగ్గర కూడా చెప్పాల్సిన అంశాలు చెప్పి వెళ్లిపోతానని ఆయన అన్నారు. తనకు మీడియాలో కనబడాలన్న తాపత్రయం లేదని ఆయన తెలిపారు.

మంత్రి పదవికి నేను కూడా అర్హుడినే: ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్
మీనాక్షి నటరాజన్‌ను కలిసిన అనంతరం రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ విలేకరులతో మాట్లాడుతూ మంత్రి పదవికి తాను కూడా అర్హుడినేనని అయన పేర్కొన్నారు. తాను మోస్ట్ బ్యాక్‌వర్డ్ వర్గానికి చెందిన నేతనని ఆయన తెలిపారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని కూడా తాను అడిగానని ఆయన పేర్కొన్నారు. మంత్రి పదవికి సంబంధించి చాలారోజుల క్రితం తన మనసులో మాటను సిఎం దృష్టికి తీసుకెళ్లానని ఆయన తెలిపారు.

మీనాక్షిని కలిసిన మాదిగ ఎమ్మెల్యేలు
మీనాక్షి నటరాజన్‌ను కాంగ్రెస్‌కు చెందిన మాదిగ ఎమ్మెల్యేలు కలిసి తమ సామాజిక వర్గానికి మంత్రి పదవిని ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ విషయాన్ని ఏఐసిసి దృష్టికి తీసుకెళతానని మీనాక్షి వారికి హామీనిచ్చారు. అనంతరం మాదిగ ఎమ్మెల్యేలు విలేకరులతో మాట్లాడుతూ ఢిల్లీకి వెళ్లి రాహుల్‌గాంధీని కలుస్తామని వారు పేర్కొన్నారు. తమ సామాజిక వర్గానికి అన్యాయం జరుగుతుందని వారు వాపోయారు. ఉత్తమ్‌కుమార్ రెడ్డి, డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్కలను కలిసి తమ వినతిపత్రాన్ని అందచేశామని వారు తెలిపారు. సిఎం రేవంత్‌రెడ్డి మాదిగల పక్షపాతి అని నిరూపించడానికి సిద్ధంగా ఉన్నారని వారు పేర్కొన్నారు. ఎస్సీ వర్గీకరణతో మాదిగలు సిఎంను దైవంగా భావిస్తున్నారని మాదిగ ఎమ్మెల్యేలు తెలిపారు. మాదిగ సామాజికవర్గానికి మంత్రి పదవి వచ్చాక 25 లక్షల మందితో భారీ బహిరంగ సభను నిర్వహిస్తామని వారు పేర్కొన్నారు. మాదిగ అంటేనే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటేనే మాదిగలని వారు తెలిపారు. మంగళవారం మాదిగ ఎమ్మెల్యేలు రహస్యంగా సమావేశం కావడంతో పాటు మీనాక్షి నటరాజన్‌కు ఫోన్ చేసి మాట్లాడడం సంచలనంగా మారిన విషయం తెలిసిందే.

మరోసారి సిఎం రేవంత్‌తో మాదిగ ఎమ్మెల్యేల భేటీ
మీనాక్షిని కలిసిన అనంతరం మాదిగ ఎమ్మెల్యేలు సిఎం రేవంత్‌రెడ్డిని కలిశారు. కొంతకాలంగా మాదిగలకు కేబినెట్‌లో అవకాశం ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో సిఎంతో రెండోసారి భేటీకావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఢిల్లీ వెళ్లి ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు రాహుల్‌గాంధీని వారు కలిసే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది.
పార్టీ కార్యకర్తలకు న్యాయం చేయాలి: జగ్గారెడ్డి
సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మీనాక్షిని కలిశారు. నియోజకవర్గానికి సంబంధించి పలు అంశాలను జగ్గారెడ్డి ఆమెతో చర్చించారు. పార్టీ కార్యకర్తలకు న్యాయం చేయాలని మీనాక్షికి జగ్గారెడ్డి విజ్ఞప్తి చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News