- Advertisement -
అమెరికా: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సన్నిహితుడు, కన్జర్వేటివ్ యాక్టివిస్ట్ చార్లి కిర్క్ (31) హత్యకు గురయ్యాడు. ఉటా వ్యాలి యూనివర్శిటీలో జరుగుతున్న కార్యక్రమంలో చార్లి మాట్లాడుతుండగా దుండగుడు ఆయనపై తుపాకీతో కాల్పులకు దిగాడు. ఓ విద్యార్థి అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తుండగా అతడిపై దుండగలు కాల్పులు జరిపారు. దీంతో వెంటనే పోలీసులు తీవ్రగాయాలైన చార్లి కిర్క్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించినట్లు అధ్యక్షుడు ట్రంప్ ధ్రువీకరించారు. ఈ ఘటన సోషల్ మీడియాలో పోస్టులు చక్కర్లు కొడుతున్నాయి. తన సన్నిహితుడు మృతి చెందడం పట్ల ట్రంప్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అమెరికాలో మాస్ షూటింగ్స్ పై వర్శిటీలో చర్చా కార్యక్రమానికి చార్లితో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
Also Read : సర్.. ఇక దేశవ్యాప్తం
- Advertisement -