Monday, June 16, 2025

చికిత్స కోసం వచ్చిన యువకుడిపై కానిస్టేబుల్ దాడి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కరీంనగర్ జిల్లా ఆసుపత్రిలో చికిత్స కోసం వచ్చిన రోగిని ఔట్ పోస్టు కానిస్టేబుల్ చితకబాదాడు. సతీష్ అనే వ్యక్తి ఇంట్లో గొడవ జరగడంతో అతని కుటుంబ సభ్యులు 100కు డయల్ చేశారు. పోలీసులు అక్కడికి చేరుకొని గాయాలతో ఉన్న అతన్ని ఆసుపత్రికి తరలించారు. చికిత్స తీసుకుంటున్న క్రమంలో కానిస్టేబుల్ సత్యనారాయణ, సతీష్ గొడవపడగా లాఠీతో కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News