Friday, June 6, 2025

తిరుమలలో ఆర్‌టిసి డ్రైవర్ పై కానిస్టేబుల్ దాడి… వీడియో వైరల్

- Advertisement -
- Advertisement -

తిరుపతి: తిరుమలలో ఆర్‌టిసి డ్రైవర్ పై కానిస్టేబుల్ దాడి చేశాడు. మంగళవారం రాత్రి తిరుమల మాధవం గెస్ట్ హౌస్ ఎదురుగా బస్సునిలిపి ఉండగా ఈ ఘటన జరిగింది. అలిపిరి డిపోకు చెందిన ఎలక్ట్రికల్ ఎసి బస్సు డ్రైవర్ అన్వేష్ రెడ్డిపై బాంబు స్క్వాడ్ కానిస్టేబుల్ దాడి చేశాడు. ఎలక్ట్రికల్ ఎసి బస్సు సిసిటివి కెమెరాల్లో దాడి దృశ్యాలు రికార్డయ్యాయి. ఆర్‌టిసి ఉన్నతాధికారుల దృష్టికి డ్రైవర్లు, ఆర్‌టిసి యూనియన్ నాయకులు తీసుకువెళ్లారు. డ్యూటీలో ఉన్న డ్రైవర్ పై బాంబ్ స్క్వాడ్ సిబ్బంది దాడి చేయడంతో తిరుమల టూ టౌన్ పోలీసులకు ఆర్‌టిసి డ్రైవర్, యూనియన్ నాయకులు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News