- Advertisement -
హైదరాబాద్: అన్ని కాలేజీల్లో మూడేళ్లలోగా వసతుల నిర్మాణం పూర్తవ్వాలని తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఖాళీల భర్తీ, సిబ్బంది ప్రమోషన్లపై సిఎం సమీక్ష నిర్వహించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 34 మెడికల్ కాలేజీల్లో పూర్తిస్థాయి వసతులు ఉండాలంటూ ప్రతి కాలేజీని క్షేత్ర స్థాయిలో పరిశీలించేందుకు ఇందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళిక (Action plan) ను వెంటనే తయారు చేయాలని అధికారులకు ఆదేశించారు. అవసరాలు, నిధుల వివరాలతో నివేదిక ఇవ్వాలని సూచించారు. అనుబంధ ఆస్పత్రుల్లో పరికరాలు, పడకలు పెంచాలని అన్నారు. కేంద్ర ఆరోగ్య శాఖ అనుమతులకు తాను చొరవ తీసుకుంటానని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
- Advertisement -