tమన తెలంగాణ /నల్గొండ రూరల్ : కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ విధానాన్ని రద్దుచేసి ఉద్యోగ కార్మికులందరినీ రెగ్యులర్ చేయాలని తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కామ్రేడ్ భూపాల్, సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం ఎంవీఎన్ విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ ఉమ్మడి నల్లగొండ జిల్లా మహాసభ జరిగింది.
ఈ మహాసభకు ముఖ్య అతిథులుగా హాజరై వారు మాట్లాడుతూ నేషనల్ హెల్త్ మిషన్ లో పనిచేస్తున్న ఎంప్లాయిస్ రెండవ ఏఎ న్ఎంలు, ఈసీ ఏఎన్ఎం, అర్బన్ హెల్త్ సెంటర్ హెచ్ఆర్సి ఏఎ న్ఎంల తోపాటు 104, 108, 102 ఆరోగ్య మిత్ర టీ సాక్స్ హాస్పి టల్స్ వర్కర్స్ టీ హబ్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ ఆయుష్ కాంట్రాక్టు ఉ ద్యోగులు హాస్పిటల్ శానిటేషన్ సెక్యూరిటీ గార్డ్ పేషంట్ కేర్ తదిత ర కాంట్రాక్టర్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరినీ పర్మినెంట్ చేయాల ని డిమాండ్ చేశారు. నూతన పిఆర్సి వెంటనే ఏర్పాటు చేయాలని అందులో కనీస వేతనం చివరి గ్రేడ్ 26000 నిర్ణయించి కేటగిరీల వారిగా వేతనాల పెంచాలని డిమాండ్ చేశారు.
నర్సింగ్ క్యాడర్ కు ప్రమోషన్స్ కల్పించాలని సిపిఎస్ రద్దు చేసి ఓపిఎస్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అన్ని క్యాడర్లకు సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని, వైద్య విధాన పరిషత్ అటానమస్ హోదా రద్దు చేయాలని డిమాండ్ చేశారు.తెలంగా ణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ యూని యన్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎండి ఫస్యుద్దీన్, యాదా నాయక్ లు మాట్లాడుతూ వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న ఉ ద్యోగ కార్మికు లు ఎదుర్కొంటున్న సమస్యలపై అనేక ఆందోళన పోరాటాలు నిర్వహించిన చరిత్ర మా సంఘాన్నిదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక ప్రజా రైతు వ్యతిరేక విధానాల గురించి నివసి స్తూ కార్మికులు పోరాడి సాధించుకున్న చట్టాలను ర ద్దు చేసి తెచ్చిన నాలుగు లేబర్ కోడ్ లను వ్యతిరేకిస్తూ జులై 9న జరుగు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో వైద్య ఆరోగ్య శాఖలో పని చేస్తున్న అన్ని క్యాడర్ల ఉద్యోగ కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
నూతన కమిటీ ఎన్నిక ..
ఈ మహాసభలలో యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ నల్గొండ జిల్లా నూతన కమిటీ ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర సీనియర్ ఉపాధ్యక్షులు కడారి బలరాం, సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య, టౌన్ కన్వీనర్ ఆవుట రవీందర్, లకపాక రాజు, పి. ప్రమీల, భూలక్ష్మి, పులికంటి భాస్కర్, గిరి యా దయ్య, సైదులు తదితరులు పాల్గొన్నారు.