- Advertisement -
హైదరాబాద్: వర్షాకాలంలో చేపట్టే ఎమర్జెన్సీ పనుల టెండర్లలో..కొందరు అక్రమాలకు పాల్పడుతున్నారని బిఆర్ఎస్ ఎమ్మెల్సి కవిత (Mlc kavitha) విమర్శించారు. తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డికి కవిత బహిరంగ లేఖ రాశారు. ఓ విదేశీ సంస్థకు చెందిన వాహనాలనే..పనులకు వినియోగించేలా నిబంధనలు రూపొందించారని మండిపడ్డారు. తెలంగాణ కాంట్రాక్టర్లకు నష్టం జరుగుతోందని, టెండర్లను (tenders) వెంటనే రద్దు చేసి, వార్డుల వారీగా టెండర్లు పిలవాలని కవిత డిమాండ్ చేశారు. తన శాఖలో జరుగుతోన్న అక్రమాలపై రేవంత్ రెడ్డి దృష్టి సారించాలని కవిత పేర్కొన్నారు.
- Advertisement -