- Advertisement -
ఢిల్లీ: దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. 24 గంటల్లోనే 1,238 కొత్త కరోనా కేసులు నమోదుకాగా ఏడుగురు మృతి చెందారు. భారత్లో ప్రస్తుతం 4,866 యాక్టివ్ కేసులున్నాయని పేర్కొన్నారు. కరోనాతో మహారాష్ట్రలో ముగ్గురు, ఢిల్లీలో ఇద్దరు, కర్నాటకలో ఇద్దరు చనిపోయారు. చాపకింద నీరులా దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ మళ్లీ విస్తరిస్తోంది. అనంతపురం జిల్లాలో తొలి కరోనా కేసు నమోదైంది. పాతూరుకి చెందిన ఓ మహిళకు కరోనా వైరస్ సోకగా ఆస్పత్రిలో చేర్చాలని వైద్యుల సూచించారు. హోమ్ ఐసోలేషన్లో ఉంటానని వైద్యులకు సదరు మహిళ చెప్పింది.
- Advertisement -