Thursday, June 5, 2025

దేశంలో 4026కు చేరుకున్న కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

దేశంలో కొవిడ్19 కేసులు చాప కింద నీరులా మెలిగా వ్యాపిస్తోంది. ఇప్పటికే 4000 మార్కును దాటేసింది. అత్యధిక కేసులు కేరళలో నమోదు కాగా, దాని తర్వాత స్థానాల్లో మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ ఉన్నాయంటూ కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటాను మంగళవారం విడుదలచేసింది. గత 24 గంటల్లో ఐదు తాజా కొవిడ్ మరణాలు సంభవించగా, క్రియాశీలక కేసుల సంఖ్య 4026కు చేరుకుందని సమాచారం. దేశంలో జనవరి నుంచి ఇప్పటి వరకు 37 కొవిడ్ మరణాలు సంభవించాయి. ఇక మే 22 నాటికి 257 కొవిడ్ రోగులు ఉండగా, మే 31 నాటికి 3395కి, ప్రస్తుతం 4026కు కేసులు పెరిగాయి. గత 24 గంటల్లో చనిపోయిన ఐదుగురిలో కేరళ, తమిళనాడు, పశ్చిమబెంగాల్‌లో ఒక్కొక్కరి చొప్పున, మహారాష్ట్రలో ఇద్దరు ఉన్నారు.

వ్యాధి సంక్రమణ తీవ్రతను గమనిస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. పశ్చిమ, దక్షిణ ప్రాంతాలలో నమూనాల జన్యు శ్రేణిని పరిశీలించినప్పుడు, ప్రస్తుత కేసుల పెరుగుదలకు దారితీసిన వైవిధ్యాలు అంతగా తీవ్రమైనవి కావని, అవి ఓమిక్రాన్ ఉపవైవిధ్యాలు(సబ్ వేరియంట్స్)కు చెందనవి మాత్రమేనని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసిఎంఆర్) డైరెక్టర్ జనరల్ డాక్టర్ రాజీవ్ బెహ్ల్ సోమవారం తెలిపారు. మేము కనుగొన్న నాలుగు రకాలు ఓమిక్రాన్ ఎల్‌ఎఫ్.7, ఎక్స్‌ఎఫ్‌జి, జెన్.1, ఎన్‌బి 1.8.1 ఉపరకాలు(సబ్ వేరియంట్స్). మొదటి మూడు రకాల కేసులు పెద్ద సంఖ్యలో కనుగొనట్టు ఆయన వివరించారు. ‘జాగురుకతతో ఉండండి, అంతేకాని ఆందోళన చెందాల్సిన పనిలేదు’ అని డాక్టర్ బెహ్ల్ అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News