సభ్య సమాజం తలదించుకునేలా ఓ దంపతులు చేసిన వికృత చేష్టలు నగరంలో కలకలం రేపాయి. డబ్బుల కోసం నగ్న చిత్రాలు, వీడియోలు పంపి సొమ్ము చేసుకోవడంపై విచారణ జరిపిన పోలీసులు ఇద్దరిని కటకటాల్లోకి నెట్టారు. వీరి కేసులో ఇంక ఎవరైనా హస్తం ఉందా అనే కోణంలో పోలీసులు దంపతులను విచారణ చేస్తున్నారు. పోలీసుల కథనం ప్రకారం…అంబర్పేట్, మల్లికార్జున నగర్కు చెందిన హరీష్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. సులభంగా డబ్బులు సంపాదించాలని ప్లాన్ వేసిన ఇద్దరు. తమ నగ్న చిత్రాలు, వీడియోలు ఆన్లైన్లో విక్రయించాలని ప్లాన్ వేశారు. దీనికి తమ ఇంటిపైనే పరదాలు కట్టి హెచ్డి కెమెరాలతో వీడియోలను రికార్డు చేశారు. వాటిని స్వీట్ తెలుగు కపుల్ 2027పేరుతో ఆన్లైన్లో పెట్టారు, చూడాలనుకునే వారు డబ్బులు కట్టిన తర్వాత వీడియోలకు సంబంధించిన లింకులు పంపించేవారు. ఇలా ఒక్కొక్కరి వద్ద నుంచి రూ.300 నుంచి రెండు వేల వరకు తీసుకుంటున్నారు.
దంపతులు నాలుగు నెలల నుంచి దందాను చేస్తున్నారు. వీడియోలకు డిమాండ్ ఎక్కువ కావడంతో మరో ప్లాన్ వేశారు. ఏకంగా లైవ్ స్ట్రీమింగ్ కావాల్సిన వారికి లింక్లు పంపిస్తున్నారు. దీనికి వేలల్లో డబ్బులు వసూలు చేస్తున్నారు, ఓ ప్రాంతంలో పదిమంది యువకులు కూడిన తర్వాత వీరు రాత్రి సమయంలో లైవ్ సెక్స్ లింక్ను పంపిస్తున్నారు. ఈ దందా గురించి స్థానికంగా వైరల్ కావడంతో విషయం పోలీసులకు తెలిసింది. వెంటనే రంగంలోకి దిగిన టాస్క్ఫోర్స్ కానిస్టేబుల్ విషయం ఉన్నతాధికారులకు చెప్పాడు. తర్వాత తాను కూడా డబ్బులు ఇవ్వడంతో దంపతులు లింక్ పంపించారు. ఇది నిజమని కానిస్టేబుల్ ఉన్నతాధికారులకు చెప్పడంతో దాడి చేసి ఇద్దరిని అరెస్టు చేశారు. కెమెరా, లైవ్ లింక్ పరికరాలు స్వాధీనం చేసుకున్నారు. దంపతులను అంబర్పేట్ పోలీసులు విచారణ చేస్తున్నారు, ఈ దందా ప్లాన్ ఎవరు ఇచ్చారు, పరికరాలు ఎలా సమకూర్చుకున్నారు, దందాలో ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలో విచారణ చేస్తున్నారు.