జిల్లా కోర్టు పై నుండి ఇద్దరు పిల్లలతో సహా ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన శనివారం రాత్రి మెదక్ జిల్లా కోర్టులో చోటు చేసుకుంది…. ఘటన స్థలాన్ని కోర్టు ఉన్నతాధికారులతో పాటు డిఎస్పి సిఐలు సందర్శించారు. ప్రాథమిక వివరాల ప్రకారం సిద్దిపేట జిల్లా పరిధిలో గల దౌల్తాబాద్ మండలానికి చెందిన రమ్య నవీన్ దంపతులకు ఇద్దరు పిల్లలు. గతంలో కుటుంబ కలహాలతో రమ్య నవీన్ మధ్య గొడవ జరిగి రమ్య తల్లి గారి ఇంటిని తగలబెట్టిన సంఘటనలో న వీన్ నిందితుడు.
ఈ కేసులో నవీన్ బైకు మొబైల్ను పోలీసులు స్వాధీనం చేసుకుని కేసు పెట్టారు. ఈ విషయంలో మెదక్ జిల్లా కోర్టుకు శనివారం నాడు చేరుకున్న నవీన్ రమ్య దంపతులు కోర్టు ప్రాంగణంలో గొడవపడి తన బైకు సెల్ఫోన్ ఇ వ్వడం లేదని మూడంతస్తుల జిల్లా కోర్టుపై నుండి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటనలో రమ్య అక్కడికక్కడే మరణించగా చిన్నారులు తీవ్ర గాయాలకు గురి కాగా వారిని హైదరాబా ద్కు మెరుగైన వైద్యం కోసం తరలించారు. న వీన్కు తీవ్ర గాయాలు కావడంతో మెదక్ లోని ఏరియా ఆసుపత్రికి చికిత్స నిమిత్తం పోలీసులు తరలించారు. ఈ విషయంలో అధికారులను పూర్తి స్థాయిలో వివరాలు తెలియాల్సి ఉంది.
కోర్టు భవనంపై నుంచి దూకి దంపతుల ఆత్మహత్య
- Advertisement -
- Advertisement -
- Advertisement -