Friday, September 12, 2025

సంగారెడ్డి జిల్లాలో విషాదం.. ఉరేసుకుని దంపతుల ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

సంగారెడ్డి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. మునిపల్లి మండలం గోపులారంలో మంగళవారం దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. గ్రామంలో నివాసముంటున్న భార్యభర్తలు రమేశ్‌(38), అనిత(32) ఇంట్లో ఉరేసుకుని సూసైడ్ కు పాల్పడ్డారు. దీంతో వారి ముగ్గురు పిల్లలు అనాథలుగా మారారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికిడ చేరుకుని పరిశీలించారు. అనంతరం మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కుటుంబ కలహాలతో రమేశ్ దంపతులు ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News