Thursday, May 1, 2025

తిరుమలలో కొనసాగుతున్న రద్దీ.. దర్శనానికి ఎంత సమయమంటే..?

- Advertisement -
- Advertisement -

తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శనివారం శ్రీవారిని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలివస్తున్నారు. దీంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 9 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఈక్రమంలో శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.

ఇక, శుక్రవారం శ్రీవారిని 57,665 మంది భక్తులు దర్శించుకుని ముక్కులు తీర్చుకున్నారు. మొత్తం 20,051 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. టిటిడి హుండీ ఆదాయం రూ.2.73 కోట్లుగా ఉందని అధికారులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News