Wednesday, September 17, 2025

యాదాద్రిలో భక్తుల రద్దీ.. దర్శనానికి నాలుగు గంటల సమయం

- Advertisement -
- Advertisement -

 

యాదాద్రి: యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి సన్నిధిలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. స్వామివారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవుదినం కావడంతో దర్శన కోసం భక్తులు బారులు తీరారు. స్వామివారి ఉచిత దర్శననాకి 4 గంటల సమయం, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం పట్టనుంది. లక్ష్మీ నరసింహస్వామివారి దర్శనం కోసం ఉదయం నుండే భక్తులతో కాంప్లెక్స్ లు, క్యూ లైన్లు ఆలయ తిరువీధులు నిండిపోయాయి. కొండ కింద సత్యనారాయణ స్వామి వ్రతంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. శివాలయంలో కార్తీక దీపాలు వెలిగించి భక్తులు మొక్కులు తీర్చుకుంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News