- Advertisement -
చెన్నై: ఐపిఎల్లో భాగంగా మిగిలిన మ్యాచ్ల కోసం చెన్నై సూపర్ కింగ్స్ ఉర్విల్ పటేల్ను జట్టులోకి తీసుకుంది. గుజరాత్కు చెందిన ఉర్విల్ను రూ.30 లక్షల కనీస ధరకు చెన్నై సొంతం చేసుకుంది. గాయపడిన వంశ్ బేడీ స్థానంలో ఉర్విల్ పటేల్ జట్టులోకి వచ్చాడు. 26 ఏళ్ల ఉర్వి ల్ పటేల్ దేవవాళీ క్రికెట్ టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ టి20 టోర్నమెంట్లో భాగంగా త్రిపురతో జరిగిన పోరులో 28 బంతుల్లోనే శత కం సాధించి చరిత్ర సృష్టించాడు. అంతేగాక విజయ్ హజారే టోర్నమెంట్లో 41 బంతుల్లోనే శతకం సాధించి సత్తా చాటాడు. దీంతో అతని ప్రతిభను పరిగణలోకి తీసుకున్న సిఎస్కె మిగిలిన మ్యాచ్ల కోసం జట్టులో చోటు కల్పించింది.
- Advertisement -