- Advertisement -
చెన్నై: తమిళనాడు రాష్ట్రం కడలూరులో బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మనలూరు వద్ద పాదచారులపైకి కారు దూసుకెళ్లడంతో ముగ్గురు దుర్మరణం చెందారు. ఈ ప్రమాదంలో మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. మనలూరులో ప్రాంతంలో బుధవారం ఉదయం పది మంది సెయింట్ ఆంథోనీ చర్చికి వెళ్తుండగా వారి పైకి కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -