- Advertisement -
తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. సర్వదర్శనం కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్టుమెంట్లు నిండిపోయాయి. వెలుపల శిలాతోరణం వరకు క్యూ లైనులో భక్తులు వేచివున్నారు. సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. ఆదివారం 87,254 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 33,777 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు.
- Advertisement -