- Advertisement -
దేశరాజధాని ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాను చంపేస్తామంటూ బెదిరింపులు వచ్చాయి. ఘజియాబాద్లోని పోలీస్ కంట్రోల్ రూమ్ (PCR)కు అర్థరాత్రి దుండగుడు ఫోన్ చేసి.. సిఎంను హత్య చేస్తామని బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో అప్రమత్తమైన అధికారులు ఢిల్లీ సిఎంకు భద్రత కట్టుదిట్టం చేశారు. ఘజియాబాద్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (సిటీ) తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం (జూన్ 5) రాత్రి 11:00 గంటల ప్రాంతంలో బెదిరింపు కాల్ వచ్చింది. బెదిరింపు కాల్ చేసిన వ్యక్తి.. తర్వాత ఫోన్ను స్విచ్ ఆఫ్ చేశాడు. బెదిరింపులకు పాల్పడిన దుండగుడి పట్టుకునేందుకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అనుమానితుడిని గుర్తించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు.
- Advertisement -