Monday, June 2, 2025

ఢిల్లీలో కొవిడ్ తో తొలి మరణం

- Advertisement -
- Advertisement -

ఢిల్లీలో 60 ఏళ్ల వృద్ధురాలు కొవిడ్ సోకడంతో మృతి చెందినట్లు అధికారులు శనివారం తెలిపారు. ఈమె గత కొన్ని రోజులుగా ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని, కొవిడ్ సోకడం యాదృచ్చికమని అధికారులు తెలిపారు. లాపరోటమీ ఆపరేషన్ అనంతరం పేగులో అడ్డంకి కారణంగా బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమెకు కొవిడ్ సోకినట్లు అధికారులు తెలిపారు. కాగా దేశ రాజధానిలో కొవిడ్ మరణం ఇదే మొదటిది. అయితే ప్రజలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఆస్పత్రుల్లో బెడ్స్, వెంటిలేటర్లు, ఆక్సిజన్, యాంటీ బయోటిక్స్, ఇతర మందులు అన్నీ సిద్ధంగా ఉన్నాయని అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News